చిగురించిన కోల్కతా ప్లే ఆఫ్ ఆశలు

       దృష్టం అంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుదే.  గుజరాత్ టైటాన్స్ పై  శనివారం  జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాల్ని నిలబెట్టుకుంది కోల్కతా.  తొలుత కోల్కతా జట్టు 20 ఓవర్లలో రెండంటే రెండే వికెట్లు పోగొట్టుకుని218 పరుగులు చేసింది.కోల్కతా జట్టులో అందరికీ పూనకంవచ్చి నట్టు ఆడి గుజరాత్ టైటాన్స్ పై మొదటినుంచి పట్టు సాధించారు.అలెన్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన  అజింక్యా రహానే  14 పరుగులు చేసి వెనుదిరిగాడు. పిచ్ నిండా పరుగులే కానీ గుజరాత్ టైటాన్స్ జట్టు లక్ష్యం దగ్గర బోల్తా పాడింది.ఓపెనర్, న్యూజిలాండ్ బట్టర్  అలెన్   తిరుగు లేని ఆట ఆడి కేవలం 35 బంతుల్లో 93 పరుగులు చేశాడు.నాలుగు బౌండరీలు,10 సిక్సర్లు బాదాడు.తమ సొంత గడ్డ అయిన ఈడెన్ గార్డెన్ లో ఆడిన ఈ మ్యాచ్ తో 11 పాయింట్లు సాధించి.రఘువంశీ  కూడా ధాటిగా ఆడి.62,.కెమరూన్.52 సాధించి,ఛాలెంజ్ విసిరారు.గుజరాటీ బౌలర్లు సిరాజ్ 1,సాయికృష్ణ 1 వికెట్లు తీశారు.  పోతే గుజరాత్ ఇన్నింగ్స్ ను సుదర్శన్,(53 నాటవుట్),శుభమన్ గిల్ 85 చేసి మంచి ఓపెనింగ్ పార్టనర్ షిప్ సాధించారు.జోస్ బట్లర్ 57 పరుగులు చేశాడు. కోల్కతా బౌలర్లు సౌరబ్ దూబే.1,గ్రీన్,1,సునీల్ నారాయణ్2. వికెట్లు పద గొట్టారు.20 ఓవర్లలో గుజరాత్ కేవలం 218 పరుగులేచేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో కోల్కతా తిరుగులేని ఆటని ప్రదర్శించింది.
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *