మోసం గురూ! జాగ్రత్త !!?

కేవైసీ మోసం పట్ల జాగ్రత్తగా ఉండండి

“మీ KYCని అప్‌డేట్ చేయండి, లేకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేయబడుతుంది” అనే సందేశం మీకు వచ్చిందా?

భయపడకండి – ఇది ఒక మోసం! క్లిక్ చేసే ముందు ఆలోచించండి.

మోసగాళ్లు నకిలీ అత్యవసర పరిస్థితులను సృష్టిస్తారు.

ఈ క్రింది మూడు నియమాలతో వారిని వారి ఆటలోనే ఓడించండి:

  • ఆగండి: తొందరపడి చర్య తీసుకోకండి!
  • ఆలోచించండి: బ్యాంకులు/NBFCలు KYC (కేవైసీ) అప్‌డేట్ కోసం ఎప్పుడూ లింకులు పంపవు.
  • చర్య తీసుకోండి: అలాంటి లింకులపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. అలాగే మీ OTP, PIN, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎల్లప్పుడూ మీ బ్యాంక్/NBFCను సంప్రదించండి.

తెలియని లింక్ = తెలియని ప్రమాదం!

మరిన్ని వివరాల కోసం: https://m.rbi.org.in/FinancialEducation/

ఆర్‌బీఐ అంటుంది – విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి!

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *